News March 18, 2024

కరీంనగర్: 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేది వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. KNR జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, 38,097 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News July 3, 2024

పెద్దపల్లి: బాలికపై వృద్ధుడు అత్యాచారం

image

ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఉన్న సామాజిక మరుగుదొడ్డిలోకి వెళ్లిన సమయంలో దుర్గయ్య(65) అత్యాచారయత్నం చేశాడు. గమనించిన గ్రామస్థులు వృద్ధునికి దేహశుద్ధి చేసి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత చట్టంలో భాగంగా పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 3, 2024

రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి: C&MD

image

ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ C&MD బలరాం సూచించారు. HYD సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల డైరెక్టర్లు, GMలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షా కాలం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించాలన్నారు.

News July 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి, కోరుట్లలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ గోదావరిఖనిలో నలుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లి మండలంలో ట్రాక్టర్, బైకు ఢీ మహిళ మృతి. @ తంగళ్ళపల్లి మండలంలో మద్యానికి బానిసై వ్యక్తి మృతి. @ సిరిసిల్ల, కరీంనగర్ లో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు. @ కేసీఆర్ ను కలిసిన జగిత్యాల, సిరిసిల్ల జడ్పి ఛైర్పర్సన్లు.