News January 15, 2025

క‌ర్ణాట‌క సీఎం: మార్చి త‌రువాత మార్పు?

image

CM సిద్ద రామ‌య్య త్వ‌ర‌లో త‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. మార్చిలో బ‌డ్జెట్ అనంత‌రం DK శివ‌కుమార్ CM ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని ప్రచారం జరుగుతోంది. ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం బాధ్య‌త‌ల బ‌దిలీ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. అందుకే సిద్ద రామ‌య్య ఎంపిక చేసిన మంత్రులు, MLAల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై పార్టీ నేత‌లు బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని అధిష్ఠానం ఇప్ప‌టికే ఆదేశించింది.

Similar News

News November 15, 2025

బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

image

తల్లిపాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనివల్ల మహిళల్లో ఎక్కువగా కనిపించే ట్రిపుల్‌ నెగెటివ్‌ అనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. డెలివరీ తర్వాత వక్షోజాల్లో సీడీ8+టీ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి శక్తిమంతమైన రక్షకభటుల్లా పనిచేస్తూ వక్షోజాల్లోని క్యాన్సర్‌ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

News November 15, 2025

30 ఓట్లతో గెలిచాడు

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్‌గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్‌ సింగ్‌కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్‌నే వరించింది. ఇక బిహార్‌లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

News November 15, 2025

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.