News September 27, 2024
కర్ణాటక.. అడగ్గానే కుంకీ ఏనుగులను ఇచ్చింది: పవన్
AP: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News September 27, 2024
ఆ డేటింగ్ యాప్లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా
తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.
News September 27, 2024
లడ్డూ వివాదంపై వైవీ పిటిషన్.. 4న సుప్రీంకోర్టులో విచారణ
AP: తిరుమల లడ్డూపై వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 4న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్తో వాస్తవాలు వెలుగులోకి రావని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు.
News September 27, 2024
BIG SHOCK: షిప్యార్డులో మునిగిపోయిన చైనా న్యూక్లియర్ సబ్మెరైన్!
సముద్రంలో ట్రయల్స్ కోసం సిద్ధం చేసిన చైనా జోహూ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ మునిగిపోయిందని సమాచారం. మేలో వుహాన్ సిటీలో యాంగ్జీ నదీ తీరంలో దీనిని డాక్ చేసినట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా US గుర్తించింది. జూన్లో చూస్తే అక్కడ ఫ్లోటింగ్ క్రేన్లు మాత్రమే ఉన్నాయని పెంటగాన్ ధ్రువీకరించింది. సబ్మెరైన్ మునిగిన విషయం డ్రాగన్ దాచడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొంది. దీంతో PLA సామర్థ్యంపై సందేహాలు పెరిగాయంది.