News June 7, 2024

అవినీతి ఆరోపణలతో కర్ణాటక మంత్రి రాజీనామా

image

మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం సిద్దరామయ్యకు సమర్పించగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు. నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ శాఖ మంత్రి బి.నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి.

Similar News

News February 3, 2026

ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

News February 3, 2026

పూజ గదిలో ఉండకూడని విగ్రహాలు

image

పూజ గదిలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడి విగ్రహాలు, ఉగ్ర రూప మూర్తులు ఉంచకూడదు. అలా ఉంటే సంపద నిలవదని అంటారు. ఎత్తుగా ఉండే విగ్రహాలు కూడా అరిష్టమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల ఆకర్షణ శక్తిని ఇల్లు భరించలేదు కాబట్టి వాటిని గుడికే పరిమితం చేయాలంటున్నారు. మరణించిన వారి ఫొటోలు సైతం పూజా మందిరంలో పెట్టకూడదట. తద్వారా దైవాగ్రహానికి గురై శాంతి, ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

News February 3, 2026

ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

image

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.