News July 19, 2024
కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం: శశి థరూర్

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం అవివేకమని ఆ పార్టీ MP శశి థరూర్ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలూ ఇలాగే స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందన్నారు. ప్రతి పౌరుడు దేశంలో నచ్చిన చోట నివసిస్తూ, పని చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కాగా ప్రభుత్వం బిల్లును హోల్డ్లో పెట్టడాన్ని ఆయన అభినందించారు.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


