News February 1, 2025

‘స్వచ్ఛంద మరణం’ హక్కును అమలు చేయనున్న కర్ణాటక

image

కారుణ్య మరణాలపై SC ఆదేశాల అమలుకు KA సిద్ధమైంది. ఎప్పటికీ నయమవ్వని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత Govt నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇస్తారు.

Similar News

News December 24, 2025

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News December 24, 2025

కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి

image

న్యూ ఇయర్‌లో అదృష్టం వరించాలంటే ఇంట్లోకి శ్రీయంత్రం, శాలిగ్రామం, స్వస్తిక్ గుర్తులను తీసుకురావాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘ఇంటి ఆవరణలో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ మొక్కలు నాటండి. తులసి కోట వద్ద శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి’ అని చెబుతున్నారు.

News December 24, 2025

పాస్టర్లకు రూ.50 కోట్లు విడుదల.. నేడు అకౌంట్లలోకి!

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసి 24వ తేదీలోపు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.