News September 24, 2024

సారీ చెప్పిన కార్తీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

image

AP: లడ్డూ విషయంలో చేసిన <<14180678>>వ్యాఖ్యలపై<<>> వెంటనే స్పందించిన హీరో కార్తీని Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. తిరుమల లడ్డూ అంశం లక్షల మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉందని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని గుర్తించినట్లు పవన్ పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల బాధ్యతతో ఉండాలని తెలిపారు. మరోవైపు సత్యం సుందరం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Similar News

News September 24, 2024

ఆ పార్టీలు బీజేపీకి మరింత దగ్గరవుతున్నాయ్!

image

TDP, JDU కేంద్రంలో BJPకి మరింత దగ్గరవుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తిరుమ‌ల ప్ర‌సాదం వివాదంలో TDP-జ‌న‌సేన వైఖ‌రి, విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ఠ జ‌రిగిన 8 నెలల త‌ర్వాత అయోధ్య రామమందిర నిర్మాణంపై PM మోదీని బిహార్ CM నితీశ్ ప్రశంసించడం అందులో భాగమే అని చెబుతున్నారు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకు BJPకి దక్కకుండా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

News September 24, 2024

భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

image

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 24, 2024

శ్రేయస్ అయ్యర్ కొత్త ఇల్లు బాగా కాస్ట్‌లీ.. Sq.ftకి ₹55,238

image

చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్‌లతో 48వ ఫ్లోర్‌లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.