News November 16, 2024

తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Similar News

News October 31, 2025

కోడలి జీతంలో మామకు రూ.20వేలు: రాజస్థాన్ హైకోర్టు

image

కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న కోడలికి రాజస్థాన్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భర్త చనిపోవడంతో అతడి ఉద్యోగం భార్యకు లభించింది. అయితే ఆమె తమ బాగోగులు చూసుకోవట్లేదని మామ భగవాన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కారుణ్య నియామకం మొత్తం కుటుంబానికి చెందుతుందని కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతినెలా రూ.20వేలు తీసి సింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.

News October 31, 2025

త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 29న జరగాల్సి ఉండగా.. తుఫానుతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామని, రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.

News October 31, 2025

కిడ్నాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్నా: నటి

image

ముంబైలో 20 మంది <<18153268>>కిడ్నాప్<<>>, నిందితుడు రోహిత్ ఆర్య ఎన్‌కౌంటర్ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ స్పందించారు. ‘రోహిత్ ఓ ప్రొడ్యూసర్‌గా నాకు పరిచయం. ఓ హోస్టేజ్ చిత్రం గురించి మాట్లాడటానికి OCT 28న కలవాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దు చేసుకున్నా. మరుసటి రోజు అతని గురించి వినగానే షాకయ్యా. రోహిత్ బారిన పడకుండా దేవుడే కాపాడాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.