News March 18, 2024

క‌ష్ణా: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

image

కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. విజయవాడలో గత వారం క్రితం రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి రూ.220 ధర పలుకుతోంది. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గింది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News November 25, 2025

కృష్ణా: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో మొత్తం 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ICDS PD రాణి తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత CDPO ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21-35సం.ల మధ్య వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు.

News November 24, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.