News March 10, 2025
అయ్యర్లో పెరిగిన కసి.. వరుస ట్రోఫీలతో సత్తా

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన తర్వాత శ్రేయస్ అయ్యర్లో కసి పెరిగింది. కెప్టెన్గా IPL-2024, రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలతో పాటు ఇరానీ కప్ గెలిపించారు. CTలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీకి గాయమవడంతో జట్టులోకి వచ్చిన అయ్యర్ కీలక సభ్యుడిగా మారారు. దీంతో శ్రేయస్కు BCCI మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


