News January 1, 2025
త్వరలోనే కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణ

AP: కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390KM ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40కి.మీ విస్తరణ కూడా జరగనుంది.
Similar News
News December 4, 2025
అమరావతిలో 2వ దశ పూలింగ్.. ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే.?

అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ దశ పూలింగ్కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నుంచి 7,464 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని పూలింగ్కు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ కాగా.. ప్రభుత్వ భూమి మరో 2054.23 ఎకరాల ఉంది. గుంటూరు(D) తుళ్లూరు మండలంలోని మిగిలిన గ్రామాల్లో 9097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 అసైన్డ్ భూమి కాగా ప్రభుత్వ భూమి 1774.07 ఏకరాలుగా ఉత్తర్వుల్లో ఉంది.
News December 4, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.


