News October 25, 2024

వచ్చే ఏడాదికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం: కిషన్ రెడ్డి

image

TG: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏటా 600 కోచ్‌లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయి. ఆధునిక LHB కోచ్‌లు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు)లు ఇక్కడే రూపొందిస్తారు. 3వేల మందికి ఉపాధి లభించనుంది. ₹680 కోట్లతో దీనిని చేపడుతున్నామని, 2025 ఆగస్టులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News December 4, 2025

డ్రై స్కిన్ కోసం మేకప్ టిప్స్

image

పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్‌గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్​ని హైడ్రేటింగ్ బేస్‌గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.

News December 4, 2025

తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

image

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

News December 4, 2025

లెజెండరీ నిర్మాత కన్నుమూత

image

లెజెండరీ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాలను శరవణన్ నిర్మించారు. రజినీకాంత్, శివాజీ గణేశన్‌ వంటి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. సంసారం ఒక చదరంగం, జెమినీ, శివాజీ, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కించారు.