News August 17, 2024

పార్లమెంట్‌లో PAC ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

image

పార్లమెంట్‌లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ నియమితులయ్యారు. 15 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఇందులో తెలుగు ఎంపీలు సీఎం రమేశ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వల్లభనేని బాలశౌరి, కె.లక్ష్మణ్‌కు చోటు దక్కింది. అలాగే గణేష్‌సింగ్ నేతృత్వంలోని ఓబీసీ సంక్షేమ కమిటీలో లక్ష్మీనారాయణ, తనూజారాణి, బీద మస్తాన్‌రావు ఉన్నారు.

Similar News

News October 14, 2025

పట్టుచీర కట్టిన తర్వాత..

image

ప్రతీ పండుగకు ఒక పట్టుచీర తీసి కడుతుంటారు మగువలు. అయితే వీటిని ప్రతిసారీ వాష్ చేస్తే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. * కొత్త చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయ్యాలి. * చాలామంది కొత్త చీరలను డిటర్జెంట్, షాంపూలతో వాష్ చేస్తారు. అప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని వాడాలి. * చీరలను కలిపి ఉతికేటపుడు వేటికవే విడిగా ఉతకాలి. లేదంటే రంగులు అంటుకోవచ్చు.

News October 14, 2025

IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

image

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్‌ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్‌తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

News October 14, 2025

BREAKING: లొంగిపోయిన మల్లోజుల

image

మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దికాలంగా ఈయన మావోయిస్టుల ప్రస్తుత పంథాకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేస్తుండటం తెలిసిందే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ఈయనపై 100కు పైగా కేసులున్నాయి. రూ.1కోటి రివార్డు ఉంది.