News June 4, 2024
చంద్రబాబుతో భేటీ కానున్న కేసీ వేణుగోపాల్?

టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్డీయేను 300 సీట్లు దాటనివ్వకుండా శాయశక్తులా కృషి చేస్తున్న ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగానే చంద్రబాబును వేణుగోపాల్ కలవనున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
Similar News
News September 10, 2025
సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం: చంద్రబాబు

ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని CM చంద్రబాబు అనంతపురంలో చెప్పారు. ‘హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు TDP హయాంలోనే వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకెళ్లాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది CBN మాట’ అని తెలిపారు.
News September 10, 2025
ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఇలా మారుతుంది!

ఎక్కువ మోతాదులో, దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సేవించిన ఆల్కహాల్ దాదాపు కాలేయం ద్వారానే జీర్ణమవుతుందని, ఈ ప్రక్రియలో ఇది అనేక రసాయనాలను విడగొడుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో మద్యం తాగే వారిని హెచ్చరించేందుకు ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఫొటోను షేర్ చేశారు.
News September 10, 2025
రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.