News June 4, 2024

చంద్ర‌బాబుతో భేటీ కానున్న కేసీ వేణుగోపాల్‌?

image

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్డీయేను 300 సీట్లు దాట‌నివ్వ‌కుండా శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్న ఇండియా కూట‌మి త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని సంపాదించే ప‌నిలో ప‌డింది. అందులో భాగంగానే చంద్ర‌బాబును వేణుగోపాల్ క‌ల‌వ‌నున్న‌ట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

Similar News

News December 6, 2025

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<>HAL<<>>), బెంగళూరు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 8 నుంచి 13 వరకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/

News December 6, 2025

రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

image

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.