News October 25, 2025
KCRపై అభిమానం: సైకిల్పై భద్రాచలం టూ జూబ్లీహిల్స్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా BRS కార్యకర్త భద్రాచలం నుంచి సైకిల్పై వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ నెల 19న ప్రారంభించిన యాత్రలో, మాజీ సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు. కాంగ్రెస్ ‘గ్యారంటీల బాకీ కార్డుల’ చిత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. BRS అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
Similar News
News October 25, 2025
నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 25, 2025
ఓటర్ జాబితాను పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ఆర్ వో, ఏఈఆర్వో, డిప్యూటీ తహశీల్దారులు, BLO, పంచాయతి కార్యదర్శులు, సూపర్వైజర్లతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
News October 25, 2025
కోస్గి ఎంపీడీఓగా తాండూరు యువకుడికి పోస్టింగ్

గ్రూప్-1లో ఉద్యోగం సాధించిన తాండూరు యువకుడు కుర్వ క్రాంతికి నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ)గా పోస్టింగ్ ఖరారైంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, డైరెక్టర్ సృజన ద్వారా నియామక పత్రాన్ని అందించారు. క్రాంతి సోమవారం కోస్గి ఎంపీడీఓగా మొదటిసారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తాండూరు ప్రజలు క్రాంతికి అభినందనలు తెలిపారు.


