News February 19, 2025

KCR అధ్యక్షతన సమావేశం.. ‘కారు’లన్నీ అటువైపే!

image

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Similar News

News February 24, 2026

హనుమకొండ: పార్టీ నుంచి బీజేపీ నేత సస్పెండ్

image

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కారణంతో హనుకొండ జిల్లా రెడ్డిపురానికి చెందిన బీజేపీ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్‌పై పార్టీ వేటు వేసింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News February 24, 2026

రాయికల్ : అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

image

నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం మామిడి, మొక్కజొన్న రైతులను దెబ్బతీసింది. రాయికల్ మండలంలోని రామాజీపేటతో పాటు జగిత్యాల గ్రామీణ, సారంగాపూర్ మండలాల్లో మామిడి పిందెలు నేలరాలగా, మొక్కజొన్న పంట నేలవాలింది. ఏళ్ల కష్టమంతా కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

News February 24, 2026

182 గ్రామాల్లో 7.95 లక్షల పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 182 గ్రామాల్లో ఇప్పటివరకు 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మార్చిలో మరో 10 గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరిన్ని గ్రామాల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.