News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Similar News

News November 28, 2025

అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News November 28, 2025

నల్గొండ: సోషల్‌ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్‌ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ తెలిపారు. ​సోషల్‌ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.

News November 27, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి