News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Similar News

News November 23, 2025

ADB నుంచి ముగ్గురు DCCలు

image

కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులను నియమిస్తు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ADB, నిర్మల్, ASF జిల్లాల DCC అధ్యక్షులు ఒకే జిల్లా వాసులు కావడం విశేషం. నరేశ్ జాదవ్ గుడిహత్నూర్ మండలం, ఆత్రం సుగుణ, వెడ్మ బొజ్జు పటేల్‌ది ఉట్నూర్‌ మండలం. ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ST విభాగం నేతలకు పదవులు రావడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

ADB నుంచి ముగ్గురు DCCలు

image

కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులను నియమిస్తు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ADB, నిర్మల్, ASF జిల్లాల DCC అధ్యక్షులు ఒకే జిల్లా వాసులు కావడం విశేషం. నరేశ్ జాదవ్ గుడిహత్నూర్ మండలం, ఆత్రం సుగుణ, వెడ్మ బొజ్జు పటేల్‌ది ఉట్నూర్‌ మండలం. ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ST విభాగం నేతలకు పదవులు రావడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

పల్నాడులో నేడు బాబా శత జయంతి వేడుకలు

image

రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలను నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ&వార్డు సచివాలయ సెక్రెటరీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.