News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Similar News

News October 25, 2025

నాగుల చవితి: పాములను ఎందుకు పూజిస్తారు?

image

దైవ స్వరూపంలో ప్రకృతి కూడా భాగమేనని మన ధర్మం బోధిస్తుంది. అందుకే ప్రకృతిలో భాగమైన పాములను కూడా మనం పూజిస్తాం. పురాణాల్లోనూ పాములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విష్ణుమూర్తి ఆదిశేషువుపై పవళించడం, శివుడు పాముని మెడలో ధరించడం, సముద్ర మథనంలో వాసుకిని కవ్వంగా ఉపయోగించడం వంటి కథలు వాటి దైవత్వాన్ని చాటి చెబుతాయి. నాగ దేవతలను ఆరాధించడం అంటే ప్రకృతి ధర్మాన్ని, జీవరాశిని గౌరవించడమే. అందుకే మనం పాములను పూజిస్తాం.

News October 25, 2025

కడప జాయింట్ కలెక్టర్‌కు మరో బాధ్యత

image

కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) వైస్ ఛైర్మన్‌గా జేసీ అతిథి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. కడప జిల్లాకు జేసీ అతిథి పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.