News March 22, 2024

KCR నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా..!

image

KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మున్సిపల్‌ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్‌(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్‌ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.

Similar News

News April 18, 2025

మెదక్: ఈ నెల 21న అప్రెంటిషిప్ మేళా

image

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా పథకం ద్వారా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 21న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 18, 2025

మెదక్: పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని చంపిన తల్లి అరెస్ట్

image

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పాపను తల్లి నదిలో పారేసిన ఘటన కొల్చారంలో జరిగింది. వివరాలు.. చిలిపిచెడ్(M)కి చెందిన గాయత్రీకి కొల్చారం(M) వాసితో పెళ్లైంది. వీరికి 4 నెలల కూతురు ఉంది. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గాయత్రీ కుమార్తెతో అదృశ్యమైంది. గాయత్రీనే రెండో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని మంజీరాలో పాపను పారేసి హత్య చేసినట్లు తేలింది. గాయత్రీని, తండ్రి దీప్లా, అత్త బూలి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

News April 18, 2025

సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

image

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.

error: Content is protected !!