News December 23, 2025
KCR, హరీశ్కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. మాజీ CM KCRతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు SIT నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో చెప్పారని తెలుస్తోంది. దీంతో KCR, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత HYD CP సజ్జనార్ నేతృత్వంలోని SIT నోటీసులు ఇవ్వనుంది.
Similar News
News December 28, 2025
బంగ్లాదేశ్లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<
News December 28, 2025
న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)తో పాటు డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.


