News August 2, 2024
వర్గీకరణ కోసం కేసీఆర్ ఎప్పుడో డిమాండ్ చేశారు: హరీశ్

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్వాగతించారు. వర్గీకరణ డిమాండ్ను తమ అధినేత కేసీఆర్ ఏనాడో తెరపైకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘వర్గీకరణ సమస్య పరిష్కారంపై ఉద్యమ సమయం నుంచే మా పార్టీ పోరాడుతోంది. రాష్ట్రంలో తొలి శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేశాం. ప్రతి సందర్భంలోనూ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News November 23, 2025
వన్డే కెప్టెన్గా రోహిత్ను మళ్లీ చూస్తామా?

SAతో వన్డే సిరీస్కు ముందు భారత కెప్టెన్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ గిల్కు గాయం కాగా, వైస్ కెప్టెన్ అయ్యర్ కూడా అందుబాటులో లేరని సమాచారం. దీంతో రోహిత్ శర్మను మళ్లీ వన్డే కెప్టెన్గా తీసుకురావాలా అనే చర్చ మొదలైంది. అయితే ఈ ప్రతిపాదనను రోహిత్ తిరస్కరించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టం చేశారు. KL రాహుల్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది.
News November 23, 2025
శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.


