News April 13, 2024
నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయగా.. పెద్దఎత్తున జనసమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
Similar News
News March 23, 2026
డర్టీ బాంబ్.. ఇరాన్ ఆఖరి అస్త్రం ఇదేనా?

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 23, 2026
ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ సెషన్-2 ఎగ్జామ్స్

JEE మెయిన్-2026 చివరి విడత (సెషన్-2) పరీక్షల షెడ్యూల్ను NTA ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్స్’ను NTA విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచి ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్షకు కొన్ని రోజుల ముందు వస్తాయి.
News March 23, 2026
నేడు అకౌంట్లలోకి రూ.6,000

TG: సిద్దిపేట పర్యటనలో నిన్న సీఎం రేవంత్ <<19449281>>విడుదల<<>> చేసిన తొలి విడత రైతు భరోసా నిధులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. రూ.6వేల చొప్పున రూ.3,600 కోట్లు అన్నదాతల ఖాతాల్లో చేరనున్నాయి. మరో 20 రోజుల్లో రూ.2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజులకు రూ.2,700 కోట్లు రిలీజ్ చేస్తామని రేవంత్ వెల్లడించారు. మొత్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తామన్నారు.


