News December 7, 2024

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్

image

TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.

Similar News

News December 2, 2025

నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

image

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.

News December 2, 2025

నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

image

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.

News December 2, 2025

అలా చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు: నాగ చైతన్య

image

సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని తన వెబ్ సిరీస్ ‘దూత’ నిరూపించిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘దూత’ రిలీజై రెండేళ్లైన సందర్భంగా SMలో పోస్ట్ పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే సీజన్-2 ఎప్పుడు అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన దూతలో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో చైతన్య మెప్పించారు.