News January 6, 2025

పాతబస్తీ మెట్రోను KCR పట్టించుకోలేదు: అసదుద్దీన్

image

TG: సీఎం రేవంత్ ఓల్డ్ సిటీ మెట్రోపై ప్రత్యేక దృష్టిసారించారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. రేవంత్ సీఎం అయిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశారని చెప్పారు. ‘చంద్రబాబు హయాంలో ఓల్డ్ సిటీకి మెట్రో ప్రస్తావన రాగా YS హయాంలో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ పట్టించుకోలేదు. పదేళ్లు అధికారంలో ఉన్న KCR దాని ఊసే ఎత్తలేదు. పైగా మేమే అడ్డుకుంటున్నామంటూ నిందలు వేశారు’ అని ఫైరయ్యారు.

Similar News

News September 17, 2025

బుమ్రాకు రెస్ట్?

image

ఆసియా కప్‌లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్‌తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్‌తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.

News September 17, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 16 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.150. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News September 17, 2025

చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

image

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.