News January 5, 2025
కేసీఆర్ రైతు బంధువు.. రేవంత్ రాబంధు: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని రైతులు ఎప్పటికీ క్షమించరని KTR అన్నారు. ‘రైతు భరోసా కింద ₹15వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు ₹12వేలే ఇస్తామంటూ మోసం చేశారు. BRS ప్రభుత్వం ₹10వేలు ఇస్తే అప్పుడు బిచ్చం అన్నారు. మరి ఇప్పుడేం అనాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, కాంగ్రెస్ నేతల మానసిక స్థితి సరిగా లేదు. KCR రైతు బంధువుగా, రేవంత్ రాబంధుగా చరిత్రలో మిగిలిపోతారు’ అని ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు.
Similar News
News October 17, 2025
చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>
News October 17, 2025
నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.
News October 17, 2025
CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు

AP: మంత్రి లోకేశ్ రేపట్నుంచి ఈనెల 25 వరకు AUSలో పర్యటించనున్నారు. వచ్చేనెల 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.