News April 7, 2024

KCR కీలక సమావేశం

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం BRS అభ్యర్థి ఎంపికపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కేటీఆర్, హారీశ్‌రావు సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం కేసీఆర్ వేట కొనసాగిస్తున్నారు.

Similar News

News January 12, 2026

అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఇండియన్ <<>>ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు(01/2027) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగిన వారు నేటి నుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. సరైన శారీరక ప్రమాణాలు కలిగి(ఎత్తు 152cm), JAN 1, 2006- JULY 1,2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iafrecruitment.edcil.co.in

News January 12, 2026

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

image

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.

News January 12, 2026

గరుడ పురాణం ఏం చెబుతుందంటే..?

image

గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. మనిషి బతికున్నప్పుడు చేసే పాపపుణ్యాలకు అనుగుణంగా యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో ఉంటుంది. సృష్టి రహస్యాలు, ధర్మ సూత్రాలు, ఔషధ గుణాలు, మోక్ష మార్గాలను కూడా ఇది బోధిస్తుంది. హిందూ సంప్రదాయంలో మరణానంతరం గరుడ పురాణ పారాయణం చేయడం వల్ల ఆత్మకు శాంతి, సద్గతులు కలుగుతాయని నమ్మకం. <<-se>>#GARUDAPURANAM<<>>