News June 22, 2024
KCR, KTRతోనే నా రాజకీయ ప్రయాణం: వినయ్ భాస్కర్
KCR, KTR తోనే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని.. అందులో ఎవరూ అనుమానం పెట్టుకోవద్దని హనుమకొండ జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ప్రాణం లాంటి పార్టీని వీడేది లేదని, తనపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు.
Similar News
News October 7, 2024
వరంగల్: ఈనెల 9న జాబ్ మేళా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 9న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ములుగు రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదు: సీతక్క
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేశ్ రెడ్డి, చుక్కల ఉదయ చందర్ కుటుంబాలను నేడు పరామర్శించానని, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News October 7, 2024
వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర రూ.7,100
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు కొత్త పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గతవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,950 పలకగా నేడు రూ.7,100కి చేరినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దసరాకు కొద్ది రోజులు ముందుగా కొత్తపత్తి వస్తుందని, దీపావళి ముగిసే వరకు ఈ పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని వ్యాపారులు పేర్కొన్నారు.