News November 25, 2025

KCR, KTR.. కాస్ట్‌లీ భూములు ఆక్రమించారు: ఫోరెన్సిక్ ఆడిట్‌

image

సిరిసిల్ల జిల్లాలో ధరణి పోర్టల్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తైంది. జిల్లాలో ధరణి పోర్టల్ దుర్వినియోగంపై ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. KCR, KTR, హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధరణి పోర్టల్‌ సాయంతో ఖరీదైన భూములను ఆక్రమించారని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. తుది నివేదికను త్వరలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నారు.

Similar News

News November 25, 2025

పెద్దపల్లి: ‘డిసెంబర్ 31లోపు దరఖాస్తులు సమర్పించాలి’

image

స్కాలర్షిప్ దరఖాస్తులు డిసెంబర్ 31లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెండింగ్ ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, హెచ్‌డబ్ల్యూఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 25, 2025

సర్పంచి రిజర్వేషన్లు.. జిల్లెల్లలో ఆశలు- నిరాశలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తంగళ్లపల్లి మండలంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లెల్ల గ్రామంలోని నాలుగు కూడళ్లలో, టీ స్టాళ్ల వద్ద పంచాయతీ ఎన్నికలపై చర్చలు మరింత జోరందుకున్నాయి. పీఠం ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు వేగంగా మారుతుండగా, రిజర్వేషన్ కారణంగా కొందరు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

News November 25, 2025

NTR: జోగి రమేష్‌కి రిమాండ్ పొడిగింపు

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.