News April 5, 2025
ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News January 22, 2026
‘పక్క స్థలం కొంటున్నారా? భయం వద్దు!’

తూర్పు/ఉత్తరం వైపు ఇల్లు ఉన్నవారు పడమర, దక్షిణం వైపు స్థలాన్ని కొనకూడదనే అపోహ ఉంది. అయితే ఆ అపోహ తప్పని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. వాస్తు నియమాల ప్రకారం.. ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని చెబుతున్నారు. ‘అయితే కొత్తగా కలిసిన స్థలంలో నైరుతి భాగం ఎత్తుగా ఉంచి, తూర్పు/ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదిలేలా మార్పులు చేయాలి. అది గొప్ప ఫలితాలను ఇస్తుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 22, 2026
VSR రీఎంట్రీ.. ఏ పార్టీలోకి?

AP: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు <<18928068>>విజయసాయి రెడ్డి<<>> ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంపై చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, తన మాజీ బాస్ వైఎస్ జగన్పై విమర్శలు చేసిన ఆయన టీడీపీ, వైసీపీలో చేరే ఆస్కారం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా ఉండే ఆయన బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. VSR ఏ పార్టీలో చేరతారని మీరు అనుకుంటున్నారు.
News January 22, 2026
లిక్కర్ స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డికే తెలుసు: విజయసాయి

AP: లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని EDకి చెప్పినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానన్నారు. మిథున్ సూచనతోనే అరబిందో నుంచి నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. సజ్జల శ్రీధర్, కసిరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ HYDలో ED ఆయన్ను 7 గంటలకు పైగా విచారించింది.


