News May 11, 2024
మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ ప్రెస్ మీట్

TG: ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ‘బస్సు యాత్ర ద్వారా ఆయన ఏం తెలుసుకున్నారు? ప్రజల మూడ్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఎంత ఉంది?’ అనే ప్రశ్నలన్నింటికీ ఆయన ప్రెస్మీట్లో సమాధానం చెప్పబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
Similar News
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
ఇవన్నీ క్యాన్సర్ కారకాలే!

నిత్యం మనం ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. పదేపదే మరిగించే నూనె, ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్లు, క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న టీ కప్పులు వీటిలోకే వస్తాయంటున్నారు. ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, వాడిన నూనెను వాడకపోవడం వంటి వాటికి దూరంగా ఉంటే ఈ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు.
News November 9, 2025
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.


