News July 16, 2024
KCR చతురత చాటారు: BRS శ్రేణులు

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై KCR ఒకింత విజయం సాధించారనే భావన BRS శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీన్ని రద్దు చేయాలన్న ఆయన పిటిషన్ విచారణలో నరసింహపై సుప్రీంకోర్టు నేడు ఘాటు <<13639787>>వ్యాఖ్యలు<<>> చేసింది. విచారిస్తూనే జూన్ 11న ఎలా మీడియాతో మాట్లాడుతారని CJI జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. KCR సైతం దీన్నే తప్పుబట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సుప్రీం దీన్ని అంగీకరించడం KCR చతురతకు నిదర్శనమంటున్నారు.
Similar News
News November 1, 2025
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్ను వెంటనే ముంబై ఎయిర్పోర్టుకు మళ్లించారు.
News November 1, 2025
టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్లో పది, ఇంటర్లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.
News November 1, 2025
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.


