News July 24, 2024

రేపు అసెంబ్లీకి కేసీఆర్!

image

TG: రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొంటారని సమాచారం. ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే మొదటి సారి కానుంది. నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News February 13, 2026

ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.

News February 13, 2026

వైట్ కాలర్ జాబ్స్‌ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

image

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

News February 13, 2026

డయాబెటిస్‌తో మతిమరుపు రిస్క్.. ఎలాగంటే?

image

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవాళ్లలో మతిమరుపు రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి ప్రకారం.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్రెయిన్ గ్లూకోజ్‌ను వాడుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా న్యూరోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది. నిరంతర హైబీపీ వల్ల ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాస్కులర్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ టిష్యూ దెబ్బతింటుంది. దీంతో దీర్ఘకాలంలో అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.