News July 25, 2024
నాడు కేసీఆర్.. నేడు రేవంత్రెడ్డి

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా ఈనెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అయితే తెలంగాణ సీఎం ఇలా చేయడం ఇది రెండోసారి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులివ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను గతంలో కేంద్రం పట్టించుకోలేదు. దీంతో 2022లో అప్పటి సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.
Similar News
News February 3, 2026
నొప్పి ఎక్కడో మాత్రకు ఎలా తెలుస్తుంది?

నిజానికి నొప్పి ఎక్కడుందో మాత్ర కనిపెట్టదు. అది రక్తంలో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. అయితే మనకు నొప్పి ఉన్నచోట ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. మాత్రలోని మందు రక్తం ద్వారా ఆ రసాయనాలు ఉత్పత్తి అవుతున్న చోటుకు కూడా వెళ్తాయి. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అక్కడ అడ్డుకుంటాయి. అలా మనకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెయిన్ కిల్లర్ ఆ శరీర భాగంలో ఉన్న అసలు సమస్యను పరిష్కరించలేదు.
News February 2, 2026
నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు.
News February 2, 2026
ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.


