News July 25, 2024
నాడు కేసీఆర్.. నేడు రేవంత్రెడ్డి

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా ఈనెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అయితే తెలంగాణ సీఎం ఇలా చేయడం ఇది రెండోసారి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులివ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను గతంలో కేంద్రం పట్టించుకోలేదు. దీంతో 2022లో అప్పటి సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.
Similar News
News January 30, 2026
ఫామ్హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

TG: హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్హౌస్లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్హౌస్కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.
News January 30, 2026
గ్రూప్-1 ఫలితాలు విడుదల

AP: గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను <
News January 30, 2026
చిరంజీవి సినిమా అరుదైన రికార్డు

చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ మూడో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందని తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.360+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.


