News March 20, 2025
KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.
Similar News
News March 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో మట్టా దయానంద్ పర్యటన ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
News March 21, 2025
‘మిస్ తెలుగు USA-2025’ పోటీలో ఖమ్మం యువతి

తెలుగుభాష గొప్పతనం, సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు నిర్వహిస్తున్న ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఖమ్మం జిల్లా యువతి ఫైనల్కు చేరి జిల్లా కీర్తిని ఎగరేసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన హెచ్ఎం పిల్లలమర్రి శివ నర్సింహారావు కుమార్తె గీతిక ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఫైనలిస్టుగా చేరి అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు.
News March 21, 2025
KMM: ఇందిరమ్మ ఇళ్లకు 69,536 అర్హుల గుర్తింపు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇటీవలి బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో 37,444, భద్రాద్రి జిల్లాలో 32,092 మంది అర్హులను గుర్తించారు, లిస్ట్ ఫైనల్ చేసి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అతి త్వరలోనే లిస్ట్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.