News August 19, 2025
KDCC బ్యాంక్ AGM రామ్మోహన్ మృతి

KDCC బ్యాంకు AGM రామ్మోహన్ సోమవారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పత్తికొండ కేడీసీసీ బ్యాంకు మేనేజర్గా ఆయన చాలాకాలం పనిచేశారు. నియోజకవర్గం పరిధిలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి.
Similar News
News September 29, 2025
నెలకు రూ.వెయ్యి ఆదా: కర్నూలు కలెక్టర్

కర్నూలు: జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతోందని తెలిపారు.
News September 29, 2025
రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.
News September 28, 2025
తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.