News February 27, 2025

మే 2న కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.

Similar News

News October 19, 2025

ముడతలు తొలగించే గాడ్జెట్

image

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్‌ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.

News October 19, 2025

IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్‌ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.

News October 19, 2025

ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్‌!

image

US అధ్యక్షుడు ట్రంప్‌ పాలసీలు, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ లక్షలాది మంది వీధుల్లోకెక్కారు. ఆ <<18047118>>నిరసనల<<>> వీడియోలు వైరల్ కాగా ట్రంప్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపాను. నా వల్లే ఇతర దేశాల్లో శాంతి నెలకొందని గొప్పలు చెప్పుకోవడం కాదు. మంచి పాలన అందించి ముందు నీ దేశాన్ని బాగుచేసుకో’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. అసలు ట్రంప్‌ను ఎందుకు ఎన్నుకున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.