News September 30, 2024

దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి: సుప్రీం

image

AP: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Similar News

News September 30, 2024

మిథున్ చక్రవర్తికి పవన్ కళ్యాణ్ అభినందనలు

image

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. నేను నటించిన ‘గోపాల గోపాల’లో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

News September 30, 2024

ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు

image

ల‌డ్డూ వివాదంలో AP ప్ర‌భుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. Sep 25న FIR న‌మోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచార‌ణ పూర్త‌వ్వ‌క‌ముందే మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా మీడియా ముందు ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. ల‌డ్డూలు రుచిగా లేవ‌ని భ‌క్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

News September 30, 2024

లడ్డూ వివాదం.. SC వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.