News February 5, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.
Similar News
News March 23, 2026
‘నిషేధం’ నుంచి 51603 ఎకరాలకు విముక్తి

AP: పరిశ్రమల కోసం APIICకి GOVT గతంలో 1.56L ఎకరాలు కేటాయించింది. ఇందులో 51603 ఎకరాల పట్టా ల్యాండ్తో పాటు ప్రభుత్వ, DKT భూములూ ఉన్నాయి. వీటిలో 121603 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో వీటిని పొందిన పరిశ్రమలు లోన్స్ పొందలేకపోతున్నాయి. కాగా ఈ భూముల్లో 51603 ఎకరాలు తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూమిగా IIC పేరిట మ్యుటేషన్ చేయాలని GOVT ఉత్తర్వులు జారీచేసింది.
News March 23, 2026
ఒకే రోజు రూ.10,320 తగ్గిన 10గ్రాముల బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ <<19453496>>మరోసారి<<>> భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.10,320 తగ్గి రూ.1,35,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.9,450 పతనమై రూ.1,24,350 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,30,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 23, 2026
3లక్షల మందికి పైగా భారత్కు తిరిగొచ్చారు: PM మోదీ

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు యుద్ధ ప్రభావిత దేశాల నుంచి 3 లక్షల మందికి పైగా భారత్కు తిరిగొచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన వారు 1000 మంది ఉన్నట్లు లోక్సభలో పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


