News October 24, 2024

2 రాష్ట్రాల్లో వారి కోసం కేజ్రీవాల్ ప్ర‌చారం

image

మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో INDIA కూట‌మి త‌ర‌ఫున ఢిల్లీ EX CM కేజ్రీవాల్ ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు సమాచారం. ఈ విష‌య‌మై శివ‌సేన UBT, NCP SP కేజ్రీవాల్‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. MHలో ఆప్ క్యాడ‌ర్ ఉన్న స్థానాల్లో వివాదాస్ప‌ద నేప‌థ్యం లేని అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌ని స‌మాచారం. హేమంత్ సోరెన్‌కు మద్దతుగా ఝార్ఖండ్‌లో ప్ర‌చారం చేస్తార‌ని ఆప్ వర్గాలు చెప్పాయి.

Similar News

News November 5, 2025

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

News November 5, 2025

NEET-SS దరఖాస్తులు ప్రారంభం

image

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

News November 5, 2025

ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.