News February 8, 2025

కేజ్రీవాల్ వెనుకంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.

Similar News

News January 19, 2026

అగాథం నుంచి అగ్రస్థానానికి తెచ్చాం: CM

image

తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అగాథంలో కూరుకుపోయిందని దావోస్ పర్యటనలో AP CM CBN అన్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని చూసిన వారంతా దాన్ని బాగు చేయగలుగుతారా? అని సందేహించారు. అసాధ్యమనీ అన్నారు. దిగిన తర్వాత ఎంత అగాథంలోకి వెళ్లిందో అర్థమైంది. అలాంటి రాష్ట్రాన్ని18 నెలల్లో నంబర్ 1 బ్రాండ్‌గా తయారుచేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో వెళ్లాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం’ అని తెలిపారు.

News January 19, 2026

వెకేషన్‌లో నయన్- త్రిష.. 40ల్లోనూ తగ్గని గ్లామర్!

image

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఈ ఫొటోలతో చెక్ పడింది. దుబాయ్‌లో ఒక లగ్జరీ బోట్‌పై చిల్ అవుతున్న ఫొటోలను నయన్ షేర్ చేశారు. ‘ముస్తఫా ముస్తఫా don’t worry ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా’ అని రాసుకొచ్చారు. 40 ఏళ్లు దాటినా వీరి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ డ్రీమ్ గర్ల్స్‌లా మెరిసిపోతున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News January 19, 2026

CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

image

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.