News February 8, 2025
కేజ్రీవాల్ వెనుకంజ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్లో ఉన్నారు.
Similar News
News January 30, 2026
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

US-ఇరాన్ వైరం చమురు మార్కెట్ను ప్రభావితం చేస్తోంది. లండన్ మార్కెట్లో బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 2.4% పెరిగి $70.06కు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6% పెరిగి బ్యారెల్ $64.82కి చేరింది. US దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 3M బ్యారెల్స్ తగ్గనుందని నిపుణుల అంచనా. హార్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం పడొచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
News January 30, 2026
భారీగా పెరుగుతున్న గిగ్ కార్మికులు

దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరి సంఖ్య 2021లో 77 లక్షలు కాగా 2025కి 1.2 కోట్లకు చేరిందని సోషియో ఎకనమిక్ సర్వే-2026 పేర్కొంది. దేశ శ్రామికశక్తిలో ఇది 2%గా ఉంది. 2030 నాటికి 6.7%కి చేరుకుంటుందని అంచనా వేసింది. 52L మంది ఈ కామర్స్, లాజిస్టిక్స్ రంగాలలో పనిచేస్తున్నారు. వీరిలో 40% మంది వేతనం ₹15000 కన్నా తక్కువే. పనిగంటలూ అధికమే. గిగ్ వర్కర్ల పెరుగుదలతో UPI పేమెంట్లూ పెరుగుతున్నాయి.
News January 30, 2026
అయ్యప్ప గోల్డ్ చోరీ: నటుడిని విచారించిన SIT

శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్ను SIT సాక్షిగా విచారించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రిలేషన్, తన ఇంట్లో పూజలపై ప్రధానంగా ప్రశ్నించారు. తరచూ శబరికి వెళ్లే తనకు అక్కడి ఉద్యోగి పొట్టి పరిచయం ఉందని జయరామ్ గతంలో తెలిపారు. దేవాలయం మూసి ఉండే రోజుల్లో ఆభరణాలు ఇంట్లో ఉంచి పూజిస్తే మంచిదని తనతో చెప్పాడన్నారు. గతంలో జయరామ్ ఇంట్లో ఆభరణాలతో పూజలు చేసిన ఫొటోలు కలకలం సృష్టించాయి.


