News March 28, 2024

స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.

Similar News

News November 13, 2025

శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

image

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>

News November 13, 2025

ఇస్రో షార్‌లో 141 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ఇస్రో <<>>సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 141 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News November 13, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్

image

TG: విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు WADUPSA పిలుపునిచ్చింది. HNK, వరంగల్, BHPL, జనగాం, ములుగు, MHBD జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి దిగడంపై హనుమకొండ PSలో ఫిర్యాదు చేసింది. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది.