News March 28, 2024
స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.
Similar News
News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.
News December 22, 2025
పాస్టర్లకు గౌరవ వేతనం మేమే ప్రారంభించాం: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరి కోసం పనిచేస్తుందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం తామే ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 24న రూ.50కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రైస్తవ సంస్థలు విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయని, NTR కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారని CM గుర్తుచేశారు.
News December 22, 2025
హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన LIC

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. <<18548745>>RBI రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో ఆ మేర తాము కూడా రుణ రేట్లను సవరించినట్లు వెల్లడించింది. కొత్తగా హోం లోన్ తీసుకునేవారికి వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.


