News June 29, 2024
జుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజుల విచారణ అనంతరం ఇవాళ సీబీఐ అధికారులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్కు జులై 12 వరకు రిమాండ్ విధించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను ఈడీ అధికారులు మార్చిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 11, 2024
ఈ నెల 16న క్యాబినెట్ భేటీ
AP: ఈ నెల 16న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. నిన్న జరగాల్సిన క్యాబినెట్ భేటీ రతన్ టాటా మరణంతో వాయిదా పడింది. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్దు, పీ-4 విధానం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం, అమరావతి నిర్మాణాలపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.
News October 11, 2024
అప్పుడే బంధాలు మెరుగుపడతాయి.. కెనడాకు తేల్చిచెప్పిన భారత్
భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకున్నప్పుడే కెనడాతో బంధాలు మెరుగుపడతాయని భారత్ స్పష్టం చేసింది. భారత్-ఆసియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా PM మోదీని కలిసి వాస్తవిక సమస్యలపై చర్చించినట్టు కెనడా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.
News October 11, 2024
నోయల్ టాటా చరిత్ర ఘనం
1957లో జన్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ దశకంలో టాటా గ్రూప్లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్ను సంస్థ MDగా 700 స్టోర్లకు విస్తరించారు. $500M విలువగల టాటా ఇంటర్నేషనల్ను $3 బిలియన్లకు తీసుకెళ్లారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఆయన రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ ట్రస్టుల విధులను పర్యవేక్షిస్తారు.