News July 14, 2024

8.5 కేజీలు తగ్గిన కేజ్రీవాల్.. ఆరోగ్యానికి పెనుముప్పు: అతీశీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న CM కేజ్రీవాల్ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆప్ మంత్రి అతీశీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, బరువు 8.5KGలు తగ్గిపోయారని చెప్పారు. ‘జైలులో ఉన్న ఆప్ చీఫ్‌కు సరైన వైద్యం అందడం లేదు. ఆయన స్ట్రోక్, బ్రెయిన్ డ్యామేజీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పరిస్థితిపై డాక్టర్లను సంప్రదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

లోకేశ్ బాగా స్పందించారు.. నిర్లక్ష్యంగా అధికారులు: హైకోర్టు

image

AP: ఎన్టీఆర్(D) ఎ.కొండూరులోని KGBVలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించారని హైకోర్టు ప్రశంసించింది. మంత్రి ఇలా పనిచేస్తుంటే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడింది. KGBVల్లో పీజీటీల సేవలను కొనసాగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి పట్టించుకోకపోవడంపై సర్వశిక్షా అభియాన్ పీడీ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

News February 25, 2026

మంత్ర జపంలోని రకాలు, పద్ధతులు

image

మంత్రాలను పఠించడాన్ని ‘జపం’ అంటారు. అమరకోశం ప్రకారం మంత్రాలు 2 రకాలు. మంత్రాలను గట్టిగా పఠించడం, పెదవులు కదుపుతూ నెమ్మదిగా పలకడం, మనసులోనే స్మరించడం వంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని సాధారణంగా 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఇందుకోసం 108 పూసలు కలిగిన జపమాలను ఉపయోగిస్తారు. సరైన ఉచ్చారణతో, ఏకాగ్రతతో మంత్రం పఠించినప్పుడు అది మన శరీరంలోని నరాలను ఉత్తేజితం చేసి సానుకూల ఫలితాలను ఇస్తుంది.

News February 25, 2026

ఇండియా ఓడినందుకు రవిశాస్త్రి హ్యాపీ.. ఎందుకంటే?

image

T20 WC: సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోవడంపై రవిశాస్త్రి స్పందించారు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురుకావడం సహజమని, ఇది టీమ్‌కు మేల్కొలుపు లాంటిదని అభిప్రాయపడ్డారు. సెమీఫైనల్స్ వంటి కీలక దశలో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఓటమి వల్ల జట్టు తన వ్యూహాలను, ప్లేయింగ్ ఎలెవన్‌ను రివ్యూ చేసుకొని పుంజుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.