News September 18, 2024
కేజ్రీవాల్కు నైతికత ఉంటే అప్పుడే రాజీనామా చేసేవారు: రాజ్నాథ్

ఢిల్లీ CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆయనకు నైతిక విలువలు ఉంటే తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉండేవారన్నారు. నిజం తేలేవరకు జైలులోని ఉండేవారని చెప్పారు. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదని, ఇప్పుడు ప్రజా కోర్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News December 27, 2025
ఇంటర్వ్యూతో NAARMలో ఉద్యోగాలు

<
News December 27, 2025
ఒకేరోజు రూ.20 వేలు పెరిగిన వెండి ధర

ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగింది. నిన్న KG వెండి రూ.9 వేలు పెరగ్గా ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూ.2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రేటు రూ.48వేలు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,200 పెరిగి రూ.1,41,220కి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450కి చేరింది.
News December 27, 2025
డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.


