News September 18, 2024
కేజ్రీవాల్కు నైతికత ఉంటే అప్పుడే రాజీనామా చేసేవారు: రాజ్నాథ్

ఢిల్లీ CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆయనకు నైతిక విలువలు ఉంటే తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉండేవారన్నారు. నిజం తేలేవరకు జైలులోని ఉండేవారని చెప్పారు. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదని, ఇప్పుడు ప్రజా కోర్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News December 23, 2025
శివాజీ కామెంట్స్.. మహిళా కమిషన్ వార్నింగ్!

సినీ వేడుకల్లో యాక్టర్లు జాగ్రత్తగా మాట్లాడాలని TG మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. మహిళల్ని అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్పై <<18648181>>వివాదాస్పద కామెంట్స్<<>> చేసిన శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను లీగల్ టీమ్ పరిశీలించిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ ‘MAA’ ప్రెసిడెంట్కు TFI వాయిస్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లేఖ రాసింది.
News December 23, 2025
విద్యార్థుల కోసం పార్ట్నర్షిప్ సమ్మిట్: సీఎం

AP: యువతకు క్వాంటం టెక్నాలజీ కోర్సులను అందించనున్నట్లు CM CBN తెలిపారు. IIT మద్రాస్ ప్రతినిధులతో భేటీలో మాట్లాడుతూ ‘JAN చివరికల్లా క్వాంటం టెక్నాలజీపై సిలబస్ రూపొందించాలి. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా JANలో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన వారిలో కలిగించేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి’ అని పేర్కొన్నారు.
News December 23, 2025
రన్నింగ్ VS వాకింగ్.. ఎవరికి ఏది మేలు?

వాకింగ్ కంటే రన్నింగ్ ఎక్కువ మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘పరిగెత్తడం వల్ల కీళ్లు దెబ్బతింటాయనేది అపోహ. హెల్తీగా ఉన్నవాళ్లు వారానికి 5 రోజులు 45ని.లు పరిగెత్తితే గుండె సామర్థ్యం, మెదడు పనితీరు మెరుగవుతుంది. నడకతో పోలిస్తే పరుగు తక్కువ సమయంలో ఎక్కువ జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి నడక, శారీరక సామర్థ్యం ఉన్నవారు రన్నింగ్ చేయడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు. SHARE IT


