News September 18, 2024
కేజ్రీవాల్కు నైతికత ఉంటే అప్పుడే రాజీనామా చేసేవారు: రాజ్నాథ్

ఢిల్లీ CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆయనకు నైతిక విలువలు ఉంటే తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉండేవారన్నారు. నిజం తేలేవరకు జైలులోని ఉండేవారని చెప్పారు. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదని, ఇప్పుడు ప్రజా కోర్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News December 11, 2025
సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కూతురి విజయం

TG: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం <<18450009>>తిమ్మయ్యపల్లిలో<<>> తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరిమధ్య హోరాహోరీగా పోరు జరగగా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. సుమ గతంలో గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఢీకొన్నాయి.
News December 11, 2025
ఛార్జీలు పెంచబోమని ‘సర్దుబాటు’ బాదుడా: షర్మిల

AP: విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఓ పక్క CM CBN ప్రకటనలు చేస్తూ మరోపక్క సర్దుబాటు పేరిట ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవ్వడం దారుణమని PCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘సర్దుబాటు పేరుతో ఇప్పటికే ₹15000 కోట్లు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ మరో ₹15651 కోట్ల సర్దుబాటు ఛార్జీలకు APERC రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ప్రజలనుంచి అభిప్రాయాలకు నోటీసు జారీచేసింది.’ అని షర్మిల దుయ్యబట్టారు.
News December 11, 2025
DRDOపై స్టాండింగ్ డిఫెన్స్ కమిటీ ప్రశంసలు

హైపర్ సోనిక్ మిస్సైల్స్ తయారీ, అధునాతన టెక్నాలజీతో రక్షణ వ్యవస్థ ఏర్పాటులో DRDO సాధించిన ప్రగతిని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. రక్షణ పరికరాల తయారీకి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడం ద్వారా 5 ఏళ్లలో రూ.2,64,156 కోట్లు ఆదా చేసిందని రిపోర్టులో పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిధులతోపాటు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను DRDO కోరుతోందని తెలిపింది.


