News July 11, 2024

కేజ్రీవాలే కీలక సూత్రధారి.. సౌత్ గ్రూప్‌‌తో కలిసి కవిత కుట్ర: ED

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ED అభియోగ పత్రంలో పేర్కొంది. ‘లిక్కర్ పాలసీపై మంత్రుల కమిటీ ఏర్పాటనేది కట్టుకథ. సౌత్ గ్రూప్‌తో పాటు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు రూ.100 కోట్లు ముడుపులిచ్చారు. వీటిలో రూ.45 కోట్లను 2022 అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ వాడుకున్నారు. BRS నాయకురాలు కవిత సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారు. మధ్యవర్తితో నిధులను ఆప్‌కు అందించారు’ అని ED పేర్కొంది.

Similar News

News November 27, 2025

టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, 2026న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 20 భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో, రాష్ట్రస్థాయిలో టీచర్ ఉద్యోగాలు సాధించడానికి CTET అవకాశం కల్పిస్తుంది.

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?