News March 3, 2025
ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన

AP: ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామన్నారు. ఇప్పటివరకు 70,232 దరఖాస్తులు వచ్చాయని, ఇంటి నిర్మాణానికి ₹4లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో నివాసయోగ్యం కాని భూములు, శ్మశానాలు, డంపింగ్ యార్డుల పక్కనున్న భూములు, వర్షం వస్తే మునిగిపోయే భూములను ఇచ్చారని ఆరోపించారు.
Similar News
News December 6, 2025
భారత్లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తోంది.
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
News December 5, 2025
పవనన్నకు థాంక్స్: లోకేశ్

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్రరీకి పుస్తకాలు, ర్యాక్లు, 25 కంప్యూటర్లు అందిస్తామని ప్రకటించిన పవనన్నకు ధన్యవాదాలు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మన విద్యావ్యవస్థను 2029 నాటికి దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న సహకారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.


