News April 9, 2024
పరీక్షలపై కీలక ప్రకటన
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలకు అనుమతించరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం. నిరాధారం. NTA అలాంటి నిబంధనలు/మార్గదర్శకాలు విడుదల చేయలేదు. యువత పుకార్లు నమ్మకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలి’ అని సూచించింది.
Similar News
News October 10, 2024
Ratan Tata: చాలామంది స్టార్టప్ ఓనర్లకు మెంటార్ కూడా..
రతన్ టాటా ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్ మాత్రమే కాదు. ఎందరో యంగ్ ఆంత్రప్రెన్యూర్స్కు ఆయన మెంటార్. 2014లో తొలిసారి స్నాప్డీల్లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత Ola, Upstox, Lenskart, CarDekho, FirstCry, Paytm, Bluestone వంటి 50+ న్యూఏజ్ స్టార్టప్పుల్లో ఇన్వెస్ట్ చేశారు. వ్యాపారంలో రాణించేందుకు ఆ ఓనర్లకు బిజినెస్ పాఠాలు చెప్పారు. డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీస్ రూపకల్పనపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
News October 10, 2024
నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం
AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
News October 10, 2024
ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.