News November 11, 2024

మహిళలకు ఉచిత బస్సుపై కీలక ప్రకటన

image

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తల్లికి వందనం స్కీమ్‌కు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు.

Similar News

News November 28, 2025

బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్‌మెంట్ ఆఫీస్‌ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in/

News November 28, 2025

పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

image

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.

News November 28, 2025

DKకి మద్దతు తెలిపిన స్వామీజీ ఎవరో తెలుసా?

image

కర్ణాటకలో <<18406507>>అధికార పోరు<<>> కొనసాగుతున్న వేళ ఇటీవల ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ డీకే శివకుమార్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్వామీజీ ఎవరనే చర్చ మొదలైంది. 72వ పీఠాధిపతిగా ఉన్న ఈయన ఆదిచుంచనగిరి వర్సిటీ ఛాన్సలర్‌గానూ, 500కు పైగా విద్యాసంస్థలను పర్యవేక్షించే ట్రస్ట్‌కి అధ్యక్షుడిగానూ ఉన్నారు. స్వామీజీ సివిల్ ఇంజినీరింగ్‌ చేసి, చెన్నై IIT నుంచి MTech, ఫిలాసఫీలో PhD చేశారు.