News October 30, 2024

గ్రూప్-2 పరీక్షలపై కీలక ప్రకటన

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC కీలక ప్రకటన చేసింది. జనవరి 5న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని, దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా జనవరి 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC ప్రకటనలో వివరించింది.

Similar News

News February 7, 2026

భారత్‌లోకి GM పంటలు? USతో డీల్‌పై RSS అనుబంధ సంస్థ ఫైర్!

image

USతో ట్రేడ్ డీల్‌లో భాగంగా తక్కువ ధరకు DDGS దిగుమతులను అనుమతించడంపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది జన్యుమార్పిడి (GM) పంటలను భారత్‌లోకి దొడ్డిదారిలో ప్రవేశపెట్టే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. దీనివల్ల దేశీయ సోయాబీన్ రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. RSS అనుబంధ BKS మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

News February 7, 2026

Vi నుంచి అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్!

image

వొడాఫోన్ ఐడియా (Vi) ‘నాన్-స్టాప్ హీరో’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా కాల్స్, అన్‌లిమిటెడ్ 4G/5G డేటా & 100 SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రూ.365 (28 రోజులు), రూ.649 (56 రోజులు), రూ.979 (84 రోజులు) ప్లాన్లతో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. కొన్ని ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

News February 7, 2026

యానిమేషన్ రూపంలో RRR మూవీ: రాజమౌళి

image

Jr.NTR, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRRపై దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘RRR మూవీకి యానిమేషన్ అడాప్షన్ విషయంలో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే పలు జపనీస్ కంపెనీలతో మాట్లాడాం. ఇంకా ఏదీ అధికారికంగా ప్రారంభం కాలేదు’ అని తెలిపారు. RRR కథకు ఇది కంటిన్యూషన్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ‘బాహుబలి- ది ఎటర్నల్ వార్ పార్ట్-1’ యానిమేషన్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.