News April 1, 2025
‘తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన

AP: తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 లోపు ఆ పథకం కింద రూ.15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. పిల్లలను ఇంకా కనాలని, వాళ్లకూ పథకాలు అందుతాయని చెప్పారు. ఇక ప్రతి మహిళకు నగదు, ఉచిత బస్సు పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ ఖజానాలో డబ్బులు లేవని, అన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అత్యధిక పెన్షన్లు ఏపీలోనే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


